ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఉదూ చేసిన తరువాత ఒక ముస్లిం తన రెండు పాదాలకు “ఖుఫ్ఫైన్” తొడుగుకున్నట్లయితే; తరువాత ఒకవేళ ఉదూ భంగపడినట్లయితే, తిరిగి ఉదూ ఆచరించునపుడు అతనికి ఇష్టమైతే “ఖుఫ్ఫైన్” ను పాదాల నుంచి తొలగించకుండా వాటిపైన తడిచేతులతో మసహ్ చేసి (తడిచేతులతో తడిమి) వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే నమాజు ఆచరించవచ్చు. ఈ విధంగా అతడు “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోను కానంత వరకు, ఒక నియమిత కాలం వరకు చేయవచ్చు. జనాబత్ స్థితికి లోనైతే మాత్రం ఖుఫ్ఫైన్’ను కాళ్ళ నుండి తొలగించి అతడు గుసుల్ చేయవలసి ఉంటుంది.