జరీర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు మూత్ర విసర్జన చేసి, తరువాత ఉదూ చేసినారు. ఆయన తన పాదాలను నీటితో కడగకుండా, తన మేజోళ్ళపై మసహ్ చేసి సరిపెట్టినారు. అప్పుడు ఆయన చుట్టూ ఉన్నవారు ఆయనతో, "మీరు ఇలా చేస్తారా?!" అని అన్నారు. దానికి ఆయన, "అవును, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూత్ర విసర్జన చేసి, తరువాత ఉదూ చేసి, తన మేజోళ్ళపై మసహ్ చేయగా చూశాను" అని అన్నారు. ఉదూ ఆయతు ఉన్న సూరతుల్-మాయిదహ్ అవతరించిన తర్వాత జరీర్ ఆలస్యంగా ఇస్లాం స్వీకరించడం, ఖుఫ్ఫైన్ (తోలు సాక్సుల) పై మసహ్ చేయడం ఆ ఆయతు ద్వారా రద్దు చేయబడలేదని సూచిస్తుంది.