‘తాబయీ’ అయిన మాలిక్ ఇబ్న్ ఔస్ ఇలా తెలియ జేస్తున్నారు: తన వద్ద బంగారు దీనార్లు ఉన్నాయని, తాను వాటిని వెండి దిర్హంలతో మార్పిడి చేయాలనుకున్నానని, అపుడు తల్హా ఇబ్న్ ఉబైదుల్లాహ్ (ర) తనతో ఇలా అన్నారు: “ముందుగా నీ దీనార్లను నాకు ఇవ్వు, నన్ను పరిశీలించనివ్వు”. ఆయన వాటిని పరిశీలించిన తరువాత వాటిని కొనడానికి నిశ్చయించుకుని అతనితో ఇలా అన్నారు: “ప్రస్తుతం నా సేవకుడు లేడు, అతడు వచ్చిన తరువాత నీకు దిర్హంలను ఇస్తాను. నీవు వెళ్ళి తరువాత రా”. అది విని అక్కడే ఉన్న ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఈ లావాదేవీ బేరాన్ని ‘ఇది సరికాదు’ అంటూ ఆక్షేపించినారు. అల్లాహ్ సాక్షిగా ఒట్టు పెట్టుకుని తల్హా ఇబ్న్ ఉబైదుల్లాహ్ (ర) తో అప్పటికప్పుడే అతనికి వెండి దిర్హంలను చెల్లించమని, లేదా అతని బంగారు దీనార్లు అతనికి తిరిగి ఇచ్చివేయమని చెప్పి, అందుకు కారణాన్ని ఇలా వివరించినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బంగారానికి బదులుగా వెండి, లేదా వెండికి బదులుగా బంగారం మార్పిడి చేసుకునే లావాదేవీ వ్యవహారంలో వాటిని అక్కడికక్కడే (ఉన్న చోటునే) మార్పిడి చేసుకోవాలి, లేకపోతే అది వడ్డీ ఆధారిత లావాదేవీ వ్యవహారం అవుతుంది, అది హరాం. మరియు ఆ లావాదేవీ వ్యవహారం చెల్లుబాటు కానిది అవుతుంది. వెండికి బదులుగా బంగారం అమ్మబడదు, అలాగే బంగారానికి బదులుగా వెండి అమ్మబడదు – అవి ఉన్నచోటునే (అక్కడికక్కడే) మార్పిడి చేసుకోబడితే తప్ప. అంతేకాకుండా, గోధుమలకు బదులుగా గోధుమలను, బార్లీకి బదులుగా బార్లీని, మరియు ఖర్జూరాలకు బదులుగా ఖర్జూరాలను విక్రయించరాదు; అయితే అవి తూగిన బరువుకు సమానంగా ఇవ్వబడితే తప్ప, లేక కొలిచిన కొలతకు సమానంగా కొలిచి ఇస్తే తప్ప మరియు అవి వెంటనే, అక్కడికక్కడే ఇచ్చివేయబడాలి (చేతులు మారాలి); అలాకాకుండా కొద్దికాలం వాయిదా తరువాత చెల్లించేలా విక్రయించుట చేయరాదు.