ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఇలా తెలిపినారు: వ్యభిచారం చేసినందుకు మాయిజ్ ఇబ్నె మాలిక్ అల్-అస్లమి రదియల్లాహు అన్హును రాళ్ళతో కొట్టి చంపిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడి ప్రజలను ఉద్దేశించి ఇలా పలికినారు: అల్లాహ్ నిషేధించిన ఈ అశుభకరమైన పాపాలు మరియు అసహ్యకరమైన, నీచమైన అక్రమాల నుండి దూరంగా ఉండండి. ఎవరైనా దానిలో పడి, ఏదైనా పాపం చేస్తే, అతనిపై రెండు విషయాలు తప్పనిసరి: మొదటిది: అల్లాహ్ తనను గోప్యంగా ఉంచిన విధంగానే (తన పాపాన్ని) దాచిపెట్టాలి మరియు తను చేసిన పాపకార్యం గురించి ఎవరికీ తెలియజేయకూడదు. రెండవది: అతను అల్లాహ్ వైపు మరలి, తక్షణం పశ్చాత్తాప పడాలి మరియు ఆ పాపాన్ని కొనసాగించ కూడదు. ఎవరి పాపం మాకు బహిరంగమైతే, ఆ పాపానికి సంబంధించిన అల్లాహ్ (సుబ్హానహు వ తాఆలా) గ్రంథంలో నిర్దేశించబడిన శిక్షను అతనిపై అమలు చేస్తాము."