ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఇద్దరు వ్యక్తులు తగవులాడుకుంటున్నారు, వారిలో ఒకతని ముఖం కోపంతో ఎర్రబారి, అతడి మెడనరాలు ఉబ్బిపోయాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నాకు ఒక మాట తెలుసు. ఒకవేళ అతడు ఆ మాట పలికినట్లయితే అతడి కోపం దూరమై పోతుంది. అతడు ఇలా పలకాలి “అఊదు బిల్లాహి మినష్’షైతానిర్రజీం” (నేను శపించబడిన షైతాను బారి నుండి అల్లాహ్ రక్షణ కోరుతున్నాను)” అన్నారు. అక్కడ ఉన్న వారు అతనితో “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అఊదు బిల్లాహి మినష్’షైతానిర్రజీం” అని పలుకమని చెప్పినారు” అని తెలియజేసారు. దానికి అతడు “నేనేమైనా పిచ్చివాడినా?” అన్నాడు. మతిస్థిమితం కోల్పోయిన వాడు తప్ప షైతాను నుండి ఎవరూ రక్షణ కోరుకోరు అని అతడు భావించినాడు.