ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: అరేబియా ద్వీపకల్పంలో నమాజులను ఆచరించే విశ్వాసులు తనను ఆరాధించడం మరియు విగ్రహాలకు సాష్టాంగం చేయడం వైపు తిరిగి వస్తారనే ఆశను సాతాను కోల్పోయాడు. అయినప్పటికీ, వివాదాలు, శత్రుత్వం, యుద్ధాలు, కలహాలు మొదలైన వాటిని ప్రేరేపించడం ద్వారా వారి మధ్య విభేదాలను నాటడానికి అతను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు మరియు కష్టపడుతూనే ఉన్నాడు.