ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనకు ఇలా తెలియజేస్తునారు: సర్వోన్నతుడైన అల్లాహ్ మొదటి మరియు చివరి వారిని పునరుత్థాన దినమున (వారి ఆచరణల) లెక్కాపత్రము కొరకు సమీకరించినప్పుడు, వారు అల్లాహ్’తో లేదా ప్రజలతో తాను చేసుకున్న ఒడంబడికను, నిబంధనలను నెరవేర్చడంలో విఫలమైన ప్రతి ద్రోహికి, తన ద్రోహాన్ని బహిర్గతం చేసే ఒక సూచనను ఏర్పాటు చేస్తాడు. ఆ రోజున, అతను ఇలా పిలువబడతాడు: ‘ఇది ఫలానా వ్యక్తి కుమారుడైన, ఫలానా వ్యక్తి చేసిన ద్రోహం’, అతడి దుష్ట పనులను, ద్రోహాన్ని సమావేశ స్థలంలోని ప్రజలకు వెల్లడించడానికి అల్లాహ్ ఇలా చేస్తాడు.