ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు. ఏ ముస్లిమ్ అయినా కూడా ఫర్జ్ నమాజు చేసే సమయం ప్రవేశించినపుడు, ఉత్తమంగా ఉదూ ఆచరించి దానిని పరిపూర్ణం చేస్తాడు; తరువాత తన హృదయాన్నీ, తన దేహాన్నీ అల్లాహ్ వైపునము మరల్చి, అణకువ, వినయం కలిగి తనను తాను పూర్తిగా సమర్పించుకున్న రీతిలో అల్లాహ్ యొక్క ఘనతను, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడుతూ, రుకూ మరియు సజ్దాలను పరిపూర్ణంగా ఆచరిస్తూ సలాహ్ ను (నమాజును) ఆచరిస్తాడు, అది అంతకు ముందు వరకు అతని వల్ల జరిగిన చిన్న పాపాలకు పరిహారంగా పరిణమిస్తుంది; అతడు పెద్ద పాపాలకు పాల్బడనంత వరకు. ఈ ఘనత కాలానుగతంగా ప్రతి సలాహ్ కు వర్తిస్తుంది.