అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు అన్హుమా మస్జిద్లోకి ప్రవేశించి ఒక తేలికపాటి నఫిల్ నమాజ్ చదివారు. ఆయన మస్జిద్ నుండి బయటకు రాగానే, అబ్దుల్లా బిన్ అనమహ్ ఆయనను అనుసరించి, "ఓ అబుల్ యఖ్జాన్! మీరు మీ నమాజ్ను చాలా తేలికగా ముగించడాన్ని నేను చూశాను!" అని అన్నారు. దానికి అమ్మార్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: "నేను దాని మూలస్థంభాలలో (అర్కానులలో), విధులలో (వాజిబ్ లలో) లేదా షరతులలో దేనిలోనైనా విడిచిపెట్టినట్లు లేదా తగ్గించినట్టు మీరు చూశారా?!" అతను, “లేదు” అని అన్నాడు. అప్పుడు అమ్మార్ ఇలా అన్నారు: "అందుకే షైతాను నన్ను పరధ్యానంలో పడవేయక ముందే నేను దానిని సంక్షిప్తం పూర్తి చేశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ‘నిశ్చయంగా ఒక దాసుడు నమాజ్ చేస్తాడు, అయితే అతనికి దాని ప్రతిఫలంలో పదవ వంతు లేదా తొమ్మిదవ వంతు లేదా ఎనిమిదవ వంతు లేదా ఏడవ వంతు లేదా ఆరవ వంతు లేదా ఐదవ వంతు లేదా నాలుగవ వంతు లేదా మూడవ వంతు లేదా సగభాగం మాత్రమే వ్రాయబడుతుంది.’