ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే ఫజ్ర్ మరియు అస్ర్ నమాజులను ఆచరిస్తారో, మరియు ఆ నమాజులను ఆచరించుటలో స్థిరత్వాన్ని కలిగి ఉంటారో వారు నరకాగ్నిలోనికి ప్రవేశించరు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు నమాజులను ఎందుకు ప్రత్యేకించినారు అంటే, అవి (విశ్వాసులపై) భారమైనవి (గా చూడబడతాయి); ఎందుకంటే ఫజ్ర్ నమాజు సమయమున అతడు తన గాఢ నిద్రను ఆనందిస్తుంటాడు; అస్ర్ నమాజు సమయమున అతడు తన దైనందిన వ్యవహారాలు, వ్యాపారం మొదలైన వాటిలో మునిగి ఉంటాడు. కనుక కఠినంగా, భారంగా ఉన్నప్పటికీ ఎవరైతే ఈ రెండు నమాజులను వదలకుండా ఆచరిస్తాడో, అతడు మిగతా నమాజులను తేలికగా ఆచరిస్తాడు.