ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రి (తహజ్జుద్) నమాజు కొరకు, లేదా ఫజ్ర్ నమాజు కొరకు లేవాలి అనుకునే వ్యక్తిపై షైతాను చేసే దాడి గురించి తెలియజేస్తున్నారు. ఒక విశ్వాసి నిద్రకు ఉపక్రమించినపుడు, షైతాను అతని మెడ భాగంలో మూడు ముడులు వేస్తాడు. మెడ భాగములో అంటే తలవెనుక భాగములో అని అర్థము షైతాను గుసగుసలకు ప్రతిస్పందించక, విశ్వాసి నిద్ర నుండి మేల్కొని అల్లాహ్’ను స్మరించుకుంటే ఒక ముడి తొలగి పోతుంది. అతడు ఉదూ చేసుకుంటే రెండవ ముడి తొలగిపోతుంది. అతను లేచి నమాజు ఆచరిస్తే చేస్తే, మూడవ ముడి విడిపోతుంది. షైతాను వేసిన ముడుల కారణంగా అతడిని ఆవరించి ఉన్న నిరుత్సాహము తొలగి పోవడంతో, అతను చురుకుగా మరియు మంచి మానసిక స్థితిలో ఉంటాడు, ఎందుకంటే అల్లాహ్ తనకు ప్రసాదించిన విధేయతతో అతను సంతోషంగా ఉన్నాడు గనుక, మరియు అల్లాహ్ అతనికి ప్రతిఫలం గురించి మరియు క్షమాపణ గురించి వాగ్దానం చేసిన దాని పట్ల ఆశాజనకంగా ఉన్నాడు గనుక.