ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఏ విధంగానైతే ఒక కొత్త వస్త్రము దీర్ఘ కాలంగా వాడుకలో ఉన్న కొద్దీ క్షీణిస్తూ ఉంటుందో, అలాగే ఒక ముస్లిం హృదయములో విశ్వాసము కూడా క్షీణిస్తూ బలహీన పడుతుంది. ఇది అల్లాహ్ యొక్క ఆరాధనలో ఉపేక్ష, అనాసక్తి, ఉదాసీనత, పాపపు కార్యములకు పాల్బడుట మరియు వాంఛ, కామము, వ్యామోహము వంటి విషయాలకు పాల్బడుట మొదలైన వాటి వల్ల జరుగుతుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమోన్నతుడైన అల్లాహ్ ను మనలోని విశ్వాసాన్ని నవీకరించమని, పునరుద్ధరించమని, విధిగా ఆచరించవలసిన ఐదు నమాజులను ఆచరిస్తూ, తరుచూ అల్లాహ్ ను స్మరిస్తూ, పాపకార్యముల నుండి ఆయనను క్షమాపణ వేడుకుంటూ అర్థిస్తూ ఉండాలని బోధిస్తున్నారు.