అబూ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ దుష్ఠునికి, దౌర్జన్యపరునికి (వెంటనే శిక్షించక) కొంత గడువునిస్తాడు. అయితే, ఆయన అతడిని పట్టుకున్నపుడు, ఇక అతడిని విడిచిపెట్టడు.” అపుడు ఆయన (ప్రవక్త (స) ఈ ఆయతును పఠించినారు: “మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) – పట్టుకొని (శిక్షించ) దలచితే – ఇలాగే పట్టుకొని (శిక్షిస్తాడు). నిశ్చయంగా, ఆయన పట్టు చాలా బాధాకరమైనది, ఎంతో తీవ్రమైనది.” (హూద్: 11:102) ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
explain-icon

వివరణ

ప్రజల హక్కులు కాజేయుట, పాపకార్యాలకు పాల్బడుట, అల్లాహ్ కు సాటి కల్పించే పనులకు (షిర్క్ నకు) పాల్బడుట మొదలైన వాటిలో పడి ఉండుటను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో హెచ్చరించారు. నిశ్చయంగా అల్లాహ్ అటువంటి దుర్మార్గునికి ఇంకా గడువునిస్తాడు, అతని శిక్షను (త్వరగా విధించకుండా) ఆలస్యం చేస్తాడు, అతని వయస్సులో మరియు అతని సంపదలో వృద్ధినిస్తాడు, అతడిని శిక్షించుటలో త్వరపడడు. (అప్పటికీ) ఒకవేళ అతడు పశ్చాత్తాప పడకపోతే, అప్పటి వరకూ అతడు పాల్బడిన అనేక అన్యాయాలకు, దౌర్జన్యాలకు ప్రతిగా అల్లాహ్ అతడిని పట్టుకుంటాడు, మరింక వదిలిపెట్టడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్’ఆన్ లోని ఈ ఆయతును పఠించినారు: “మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) – పట్టుకొని (శిక్షించ) దలచితే – ఇలాగే పట్టుకొని (శిక్షిస్తాడు). నిశ్చయంగా, ఆయన పట్టు చాలా బాధాకరమైనది, ఎంతో తీవ్రమైనది”. (హూద్: 11:102)

explain-icon

fawaed

  • అన్నింటికంటే ముందుగా తెలివిగల వాడు చేయవలసిన పని తాను చేసిన పాపకార్యాలకు, దౌర్జన్యాలకు, అన్యాయాలకు గాను పశ్చాత్తాప పడుట. అంతే గానీ అల్లాహ్ తన ప్రణాళికలో భాగంగా అతడిని వెంటనే శిక్షించకుండా ఉండుట, అతడి వయస్సులో, అతడి సంపదలో వృద్ధి కలిగించుట మొదలైన వాటి వల్ల అతడు ఏమరుపాటుకు గురికారాదు, మోసపోరాదు.
  • అల్లాహ్ దుర్మార్గులకు, దౌర్జన్యకారులకు మరింత గడువునిస్తాడు – వారిని వెంటనే శిక్షించడు - వారు పశ్చాత్తప పడుటకు గాను; అలాగే పశ్చాత్తాప పడకుండా వారు మరింతగా పాపపు కార్యాలలో మునిగిపోతే వారిని రెండింతలు శిక్షించుటకుగానూ.
  • సమాజాలపై, జాతులపై అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడుటకు ముఖ్య కారణాలలో, ఆ జాతులు దుర్మార్గానికి, దౌర్జన్యానికి, అన్యాయాలకు పాల్బడుట కూడా ఒకటి.
  • ఒకవేళ ఏదైనా నగరాన్ని అల్లాహ్ నాశనం చేయదలుచుకుంటే, అందులో అన్యాయానికి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలిచిన ధర్మపరాయణులు కూడా ఉంటారు. అల్లాహ్ యొక్క శిక్ష అందరిపై వచ్చి పడినప్పటికీ, ఆ శిక్ష వారికి (పరలోకంలో) హాని కలిగించదు. పునరుత్థాన దినమున వారు అన్యాయానికి, అధర్మానికి, దౌర్జన్యానికీ వ్యతిరేకంగా నిలిచి ప్రాణాలను విడిచినందుకు గాను వారు లేపి నిలబెట్టబడతారు.
explain-icon

ఇంకా