ఈ హదీసులో - ఆయిషా మరియు అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ్ మనకు ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మృత్యు ఘడియలు సమీపించినపుడు, వారు (తాను కప్పుకుని ఉన్న) వస్త్రము యొక్క భాగాన్ని తన ముఖము పైకి లాక్కుంటూ, మృత్యువేదన కారణంగా (అలా కప్పుకుని ఉండడం) కష్టమనిపించినపుడు, ఆ వస్త్రాన్ని తన ముఖము పైనుంచి తీసివేసేవారు. అంతటి కఠిన ఘడియలలో ఉన్నపుడు, వారు ఇలా అన్నారు: “అల్లాహ్ యొక్క శాపము యూదులు మరియు క్రైస్తవులపై ఉండుగాక, వారిని తన కరుణ నుంచి దూరం చేయుగాక, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులపై మస్జిదులు (ఆరాధనా గృహాలు) నిర్మించుకున్నారు”. ఈ విషయము ఇంత గంభీరమైనది కాకపోయి ఉంటే వారు ఆ స్థితిలో (ఉండి కూడా) అలా అని పలికే వారు కాదు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ ను అలా చేయడము నుండి నిషేధించినారు. ఇది (అంటే సమాధులపై ఆరాధనా గృహాలను నిర్మించుట) యూదులు మరియు క్రైస్తవుల ఆచరణ, మరియు ఇది అల్లాహ్ తో షిర్క్ చేయుటకు (ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టుటకు) ఒక మార్గము అవుతుంది.