రాఫిఅ్ బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: దుల్-హులైఫాలో వారందరూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఉన్నారు. అపుడువారు కరువుబారిన పడ్డారు. వారు (అప్పటికే గెలిచిన యొధ్ధములో) బహుదైవారాధకుల నుండి ఒంటెలను మరియు గొర్రెలను యుధ్ధసంపద రూపములో స్వాధీనం చేసుకున్నారు. ఆ యుధ్ధ సంపదను విభజించడానికి ముందే తొందరపడి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడగకుండానే, వాటిలో కొన్నింటిని వధించి, వంట పాత్రలను ఏర్పాటు చేసారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహబాల సమూహానికి వెనుక నడుస్తూ వస్తున్నారు. ఎపుడైతె వారికి ఈ విషయం తెలిసిందో, వారు ఆ వంట పాత్రలను బోర్లించేసి అందులోని మాంసాన్ని పారవేయమని ఆదేశించినారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యుధ్ధసంపదను, పది గొర్రెలను ఒక ఒంటెకు సమానంగా, అందరిలో విభజించినారు. వాటిలో ఒక ఒంటె పారిపోయింది. వారు దానిని పట్టుకోలేకపోయారు. వారి వద్ద కొన్ని గుర్రాలే ఉన్నాయి. వారిలో ఒకరు ఒక బాణాన్ని ఎక్కుపెట్టి ఒంటెపైకి వదిలాడు. ఆబాణముతో అల్లాహ్ దానిని ఆగిపోయేలా చేసినాడు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ఈ పెంపుడు జంతువులు అడవి మృగాల వంటి లక్షణాలనే కలిగిఉంటాయి. కనుక వీటిలో ఏదైనా మీ అదుపు తప్పితే, మీరు దానినిపట్టుకో లేకపోతే, వాటిని ఇలాగే అదుపులోనికి తెచ్చుకొండి. రాఫిఅ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “రేపు మేము శత్రువును ఎదుర్కొనవచ్చు. యుధ్ధములో ఉపయోగించిన కారణంగా మా ఖడ్గాలు పదును కోల్పోతయేమోనని భయంగా కూడా ఉంది. మావద్ద కత్తులు కూడా లేవు. మరి అత్యవసరంగా జంతువులను (ఆహారం కొరకు) ‘జిబహ్’ చేయవలసి వస్తే (వధించవలసి వస్తే) మేము పదునైన కర్రతో జిబహ్ చేయవచ్చునా?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “(జంతువు శరీరం నుండి) పూర్తిగా రక్తం బయటకు పారేలా చేయగలిగే ఏ పరికరాన్నైనా ఉపయోగించండి; దంతములు మరియు గోళ్ళు తప్ప. అలాగే అల్లాహ్ నామం ఉచ్చరించబడి జిబహ్ చేయబడిన దానిని తినండి. అయితే దంతములు మరియు గోళ్ళు ఎందుకు ఉపయోగించరాదో నేను మీకు చెబుతాను; దంతములు ఎముకలు కనుక మరియు గోళ్ళు అబిస్సీనియా (ఇథియోపియా) బహుదైవారాధకుల సాధనాలు గనుక.”