ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు రెండు గొప్ప ధార్మిక ఆచరణలను వివరించారు: మొదటిది: ఎవరైతే ఉదూను ఆచరిస్తాడో మరియు దానిని చక్కగా, పూర్తిగా, సంపూర్ణంగా మరియు నిర్దేశించిన పద్ధతిలో పరిపూర్ణం చేసి, ప్రతి అవయవానికి దానికి తగిన మొత్తంలో నీటిని అందజేసి, అప్పుడు ఇలా: “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు” అని పలుకుతాడో, అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువ బడుతాయి. ఏ ద్వారము ద్వారా కోరుకుంటే ఆ ద్వారము నుండి అతడు స్వర్గములోనికి ప్రవేశించవచ్చు.” రెండవది: ఎవరైతే ఉదూ చేయునపుడు ఉదూను పూర్తిగా, సంపూర్ణంగా ఆచరించి, తరువాత నిలబడి, రెండు రకాతులను, హృదయపూర్వకంగా మరియు వినయముతో వాటి వైపునకు తిరిగి, అతడి ముఖాన్ని మరియు శరీరంలోని అన్ని అవయవాలను అల్లాహ్ కే (ఆయన ఆరాధనకే) సమర్పించుకుని ఆచరిస్తాడో, స్వర్గం అతని కొరకు విధి (వాజిబ్) చేయబడుతుంది.