ప్రజలు తమ మాట వినాలని, తు.చ. తప్పకుండా పాటించాలను, అది తమ హక్కు అని, తమ హక్కును ప్రజల నుండి బలవంతంగా లాక్కుంటూ, వారికి న్యాయం చేయడాన్ని, యుద్ధంలో గెలిచిన సంపదను పంచడాన్ని, వారి సమస్యలను పరిష్కరించడాన్ని, వారి కష్టాలను తొలగించడాన్ని నిరాకరించే పాలకుని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించడం జరిగింది “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం!, అటువంటి సందర్భములో మమ్ములను ఏమి చేయమంటారు, మీ ఆదేశము ఏమిటి?” అని. అది తనకు ఇష్టం లేని విషయం, తాను అసహ్యించుకునే విషయం అన్నట్లుగా, ఆ ప్రశ్నించిన వ్యక్తి నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖాన్ని మరో వైపునకు త్రిప్పుకున్నారు. కానీ ఆ ప్రశ్నించిన వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అదే ప్రశ్న రెండోసారి, మూడోసారి కూడా అడిగాడు. అపుడు అల్-’అష్’అత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) అతడిని మౌనంగా ఉండమని పక్కకు లాగినారు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని ప్రశ్నకు స్పందిస్తూ ఇలా సమాధానమిచ్చారు: “వారు చెబుతున్న దానిని వినండి, మరియు వారి ఆదేశాలను పాటించండి;