ఈ హదీథు లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేస్తున్నారు: తన మరణం తరువాత, పాలకులు ప్రజలను పరిపాలిస్తారు; వారు అసత్యాలు పలుకుతారు, వారు ఆచరించని పనులు ఆచరించినట్లు చెబుతారు మరియు వారు పరిపాలనలో అన్యాయానికి పాల్బడతారు. ఎవరైతే వారితో చేరుతాడో, వారి అసత్యాలను విశ్వసిస్తాడో, లేదా తప్పుగా ప్రవర్తించడం ద్వారా, లేక వారిని సంతోషపెట్టే మాటలు మాట్లాడడం ద్వారా, అంటే ఉదాహరణకు వారు ఇష్టపడేలా ఫత్వాలు ఇవ్వడం, లేదా వారిచ్చే వాటికి (బహుమానాలు, హోదాలు, మొ.) ఆశపడి వారికి సహాయపడడం చేసిన వాడి నుండి నన్ను నేను దూరం చేసుకుంటున్నాను. అతను నాకు చెందినవాడు కాదు, నేను అతనికి చెందినవాడిని కాదు. మరియు తీర్పు దినమున అతడు “హౌదె-కౌథర్” (అల్ కౌథర్ తటాకము) వద్దకు రాడు. అయితే, వారితో చేరని వాడు, వారి అసత్యాలను విశ్వసించనివాడు, మరియు వారి అకృత్యాలలో, దౌర్జన్యాలు, అణచివేతలో వారికి సహాయం చేయని వ్యక్తి నావాడు, మరియు నేను అతనివాడిని, మరియు అతను తీర్పు దినమున “హౌదె -కౌథర్” (అల్ కౌథర్ తటాకము) వద్దకు వస్తాడు.”