ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు – షరియత్ అనుమతించిన పరిధులకు అనుగుణంగా ధర్మానికి సంబంధించిన విషయాలైనా లేక ప్రాపంచిక జీవితానికి సంబంధించిన విషయాలైనా ఆచరించుటకు, అనుసరించుటకు సులభతరం చేయాలి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు సత్సందేశాలను, మంచి విషయాలను, శుభవార్తలను తెలియజేయాలని, వాటినుండి ప్రజలను దూరం చేయరాదని ఆదేశిస్తున్నారు.