ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఎవరికైతే అల్లాహ్ శుభాన్ని కలుగజేయాలని తలపోస్తాడో, పరమ పవిత్రుడైన అల్లాహ్ అతనికి తన ధర్మము (అయిన ఇస్లాం) యొక్క లోతైన అవగాహనను కలుగజేస్తాడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రసాదించిన వాటిలో తన నుండి ఇతరులకు చేర వలసిన పోషణ, ఙ్ఞానము మొదలైన వాటిని చేరవేయువాడు మాత్రమే; వాస్తవములో ప్రసాదించేవాడు అల్లాహ్ మాత్రమే. ఇతరుల కొరకు వనరులు, కార్యకారణాలు ఉంటాయి, అవి అల్లాహ్ ఆఙ్ఞతో తప్ప వారికి ఎటువంటి మేలూ కలుగజేయలేవు. ఈ ఉమ్మత్ అల్లాహ్ యొక్క బోధనలు, ఆదేశలపై దృఢంగా మరియు స్థిరంగా నిలిచి యుండుట, అనుసరించుట ఎన్నటికీ విడనాడదు. మరియు వీరిని (ఈ ఉమ్మత్’ను) వ్యతిరేకించేవారు, ప్రళయ ఘడియ స్థాపితమయ్యేంత వరకు వీరికి ఏమాత్రమూ హాని కలిగించలేరు.