ఈ హదీసులో – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఎవరైతే ప్రజల మధ్య సత్యము మరియు న్యాయము ఆధారంగా తీర్పు చేస్తారో అంటే ఎవరైతే తమ శాసనం క్రింద ఉన్నారో వారిపట్ల, ఎవరైతే తమ అధికారం క్రింద ఉన్నారో వారి పట్ల, వారి కుటుంబాల పట్ల న్యాయంగా వ్యవహరిస్తారో, వారు తీర్పు దినమునాడు తమ గౌరవార్థం కాంతితో తయారు చేయబడిన ఉన్నత ఆసనాలపై అశీనులవుతారు” అని తెలియజేస్తున్నారు. ఆ ఉన్నతాసనాలు అనంత కరుణామయుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ యొక్క కుడి చేతివైపు పొందుపరచబడి ఉంటాయి. పరమ పవిత్రుడైన అల్లాహ్ యొక్క రెండు చేతులూ కుడి చేతులే.