ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం, విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హాను సౌమ్యంగా ఉండమని హితబోధ చేస్తున్నారు, అల్లాహ్ తన దాసుల పట్ల సౌమ్యుడు మరియు దయగలవాడు అని, ఆయన వారికి కఠినత్వాన్ని, కష్టాన్ని కాదు, వారికి సౌలభ్యాన్ని కోరు కుంటున్నాడు అని అన్నారు. ఆయన వారి సామర్ధ్యానికి మించి వారిపై భారాన్ని మోపడు. మరియు అల్లాహ్, తన దాసుడు ఇతరులతో వ్యవహరించడంలో సౌమ్యతను మరియు సౌలభ్యాన్ని అవలంబించడాన్ని, అలాగే ఇతరులతో వ్యవహరించుటలో కఠినత్వాన్ని లేదా తీవ్రతను నివారించడాన్ని ఇష్టపడతాడు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు - సౌమ్యత మరియు కరుణ చూపేవారికి ఈ లోకంలో అల్లాహ్ ప్రశంసనీయమైన ఖ్యాతిని ప్రసాదిస్తాడు; మరియు వారు తమ లక్ష్యాలను సాధించడములో మరియు వారి వ్యవహారాలు కొనసాగించడంలో అల్లాహ్ సౌలభ్యాన్ని ప్రసాదిస్తాడు. మరియు హింస, కఠినత్వాలకు ఇవ్వని గొప్ప ప్రతిఫలాన్ని ఆయన ప్రసాదిస్తాడు; ఎందుకంటే సౌమ్యత మరేదీ తీసుకురాలేని ఫలితాలను తెస్తుంది.