ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హును మదీనాలోని ఒక వీధిలో కలవడం జరిగింది. అపుడు అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు జనాబహ్ స్థితిలో (అపరిశుద్ద స్థితిలో) ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్న గౌరవం, పూజ్యభావం కారణంగా అపరిశుద్ద స్థితిలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చోవడం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో సంభాషించడం అతనికి ఇష్టం లేకపోయింది. ఆ స్థితిలో తాను అపవిత్రుడిగా ఉన్నాను అని అనుకున్నారు. దాని కారణంగా అతను రహస్యంగా అక్కడి నుండి వెళ్ళిపోయి, తలస్నానం చేసి, తిరిగి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చొన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని ఎక్కడికి వెళ్ళినావు అని అడిగినారు. అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు తన పరిస్థితి గురించి వివరిస్తూ, జనాబహ్ కారణంగా తాను అపవిత్రంగా ఉన్నందున ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చోవడం తనకు ఇష్టం లేకపోయినది అని చెప్పారు. ఆ మాటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆశ్చర్యపోయి ఇలా అన్నారు: “నిశ్చయంగా విశ్వాసి పవిత్రుడు మరియు ఎట్టి పరిస్థితిలోనూ అపవిత్రుడు కాడు, అతడు జీవించి ఉన్నా లేదా చనిపోయినా కూడా”.