సహబాలలో నుండి ఒకరు “నేను నమాజు ఆచరిస్తే బాగుండు, నాకు మనశ్శాంతి కలుగుతుంది” అన్నారు. (అతడు ‘నమాజు అయిపోతే బాగుండు, విశ్రాంతి కలుగుతుంది’ అంటున్నాడేమో అనుకుని) అక్కడ ఉన్నవారు అతడు అలా అనడాన్ని వ్యతిరేకించారు. దానికి అతడు “ఓ బిలాల్! నమాజు ప్రారంభించుట కొరకు అఖామత్ పలుకు. అందరమూ అందులో మనశ్శాంతి పొందవచ్చు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలుకగా నేను విన్నాను” అని వారికి తెలియజేసాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా ఎందుకన్నారంటే నమాజులో దాసుడు తన ప్రభువుతో ఏకాంత సంభాషణ చేస్తూ ఉంటాడు. అది అతడి ఆత్మకు, హృదయానికీ సాంత్వన కలుగజేస్తుంది.