ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు మస్జిద్-ఎ-నబవీ ని, ఉన్న స్థితిలో కంటే ఉత్తమంగా పునర్నిర్మించాలని సంకల్పించినారు. దానికి ప్రజలు ఇష్టపడలేదు, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో నిర్మించబడిన మస్జిదు అసలు నిర్మాణములో మార్పులు వస్తాయని. (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో) మస్జిదు మట్టితో నిర్మించబడింది, దాని కప్పు సున్నపు రాయితో కట్టబడింది. అయితే ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు రాతితో మరియు ప్లాస్టరుతో నిర్మించాలని తలపోసినారు. ప్రజల అయిష్టతను గమనించి, ఆయన వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా తాను విన్నానని తెలియజేసినారు – “ఎవరైతే కేవలం అల్లాహ్ యొక్క కరుణ కొరకు, కపటత్వం గానీ లేక కీర్తి కండూతి గానీ లేకుండా, మస్జిదును నిర్మిస్తారో అల్లాహ్ వారు చేసిన పనిని పోలిన అత్యుత్తమమైన దానిని అతనికి ప్రసాదిస్తాడు; ఈ విషయానికి సంబంధించి ఆ అత్యుత్తమమైనది ఏమిటంటే అల్లాహ్ స్వర్గములో దానిని పోలిన అత్యుత్తమ ఇంటిని అతని కొరకు నిర్మిస్తాడు.