ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: అవిశ్వాసులు మరియు విగ్రహారాధకులతో - వారు ‘అల్లాహ్ తప్ప వేరే నిజఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయన అద్వితీయుడూ, ఏకైకుడు అని ఆయనకు సాటి ఎవరూ లేరు అని; మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు అని సాక్ష్యము పలికి, ఆ పలికిన సాక్ష్యానికి అనుగుణంగా దినము మరియు రాత్రిలో (విధిగావించబడిన) ఐదు నమాజులను ఆచరిస్తూ, అర్హులైన వారికి జకాతు చెల్లించనంత వరకు – వారితో పోరాడమని ఆఙ్ఞాపించబడినాను. ఒకవేళ వారు వీటిని ఆచరించినట్లయితే, ఇస్లాం వారి రక్తాన్ని (వారి ప్రాణాలను), వారి సంపదలను రక్షిస్తుంది. కనుక, ఇస్లాం ఆదేశాల ప్రకారం మరణ శిక్ష విధించబడే నేరం ఏదైనా చేస్తే తప్ప వారి ప్రాణాలను తీయడం నిషేధము. తరువాత తీర్పు దినమునాడు అల్లాహ్ వారి లెక్కా పత్రము తీసుకుంటాడు; ఎందుకంటే వారి అంతరంగములో ఏమి ఉన్నదో ఆయనకు తెలుసు గనుక.