ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: 'ఎవరైతే అమాయకులపై తరుచుగా శాపాలు పెడతారో, వారు రెండు శిక్షలకు పాత్రులవుతారు. మొదటి శిక్ష: ప్రళయ దినాన అతడు ప్రవక్తలు, సందేశహరులు తమ తమ జాతులకు దైవసందేశాలను అందజేసారని సాక్ష్యం ఇచ్చే అర్హత కోల్పోతాడు. అంతేగాక, అతడి దుష్టత్వం వలన ఇహలోకంలోనూ అతడి సాక్ష్యం అంగీకరించబడదు. అలాగే అతడికి 'షహాదత్' (అల్లాహ్ మార్గంలో ధర్మయుద్ధం చేస్తూ మరణించే భాగ్యం) లభించదు. రెండవ శిక్ష: ప్రళయ దినాన విశ్వాసులు (ముస్లింలు) నరకానికి అర్హులైన తమ సోదరుల కొరకు మధ్యవర్తన చేసే సమయంలో, ఈ శపించే వ్యక్తి (లాఅిన్) ఎవరికీ మధ్యవర్తన చేయడానికి అనుమతించబడడు.