ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు సమాధుల ప్రక్కనుండి వెళ్ళడం జరిగింది. అపుడు వారు ఇలా అన్నారు: “ఈ సమాధులలో ఉన్నవారు నిశ్చయంగా శిక్షించబడు చున్నారు. మీ దృష్టిలోని ఘోరమైన పాపములలో ఏదో ఒకటి చేసినందుకు వారు శిక్షించబడుటలేదు; కానీ అది అల్లాహ్ దృష్టిలో ఘోరమైనది. వారిలో ఒకడు మూత్ర విసర్జన చేయునపుడు మూత్రపు చుక్కలు చింది తన శరీరముపై, బట్టలపై పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. రెండవ వాడు వ్యక్తుల మధ్య విభేదాలు మరియు చీలికలను కలిగించే, ఉద్దేశ్యంతో ప్రజల మధ్య ఇతరుల మాటలను ప్రసారం చేస్తూ ఉండేవాడు.