ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, అల్లాహ్ నుండి ప్రతిఫలం మరియు ప్రజల నుండి ప్రశంసలు మరియు కీర్తి కోరుతూ పోరాడటానికి (జిహాద్’కు) బయలుదేరిన వ్యక్తిపై షరియత్ పరమైన తీర్పును గురించి అడగడానికి వచ్చాడు. అతడు ప్రతిఫలం పొందుతాడా అని? దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు: "అతనికి ఎలాంటి ప్రతిఫలం లభించదు. ఎందుకంటే, అతడు (జిహాద్’లో పాల్గొనాలనే) తన సంకల్పములో అల్లాహ్’కు ఇతరులను భాగస్వాములుగా చేసినాడు”. ఆ వ్యక్తి తన ప్రశ్నను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మూడు సార్లు పునరావృతం చేశాడు. మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి మూడుసార్లు సమాధానమిచ్చారు మరియు మూడుసార్లూ అదే సమాధానం ధృవీకరించారు - అతనికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ చేత ఆచరణలు అంగీకరించబడే నియమాన్ని గురించి అతనికి తెలియజేశారు: అల్లాహ్ కార్యాలను అంగీకరించడు, అవన్నీ కేవలం అల్లాహ్ కొరకు, మరియు ఇతరులను పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన ఆయనకు (అల్లాహ్’కు) భాగస్వాములను చేయకుండా ఆచరిస్తే తప్ప.