ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత కలవర పరిచేలా, ఏదో వస్తువు పడిపోయినట్లు పెద్ద శబ్దం విన్నారు. వారితో పాటు అక్కడే ఉన్న సహాబాలను (రదియల్లాహు అన్హుమ్) ఆ శబ్దాన్ని గురించి అడిగారు. దానికి వారు ‘అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాత్రమే బాగా ఎరుగుదురు’ అని సమాధానమిచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారితో ఇలా అన్నారు: మీరు విన్న ఈ శబ్దం డెబ్బై సంవత్సరాల క్రితం నరకం అంచు నుండి విసిరిన రాయి, నరకపు దిగువకు చేరుకునే వరకు పడిపోతూ పడిపోతూ, నరకం అడుగున తాకినపుడు చేసిన ఆ శబ్దాన్ని మీరు విన్నారు.