ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపు తున్నారు: ఎవరైతే, అల్లాహ్ కు ఏవిషయంలోనూ, ఎవరినీ మరియు దేనినీ ఆయనకు సాటి కల్పించని స్థితిలో చనిపోతారో, అటువంటి వారు తాము చేసిన తప్పులకు, పాపాలకు కొద్ది కాలం నరక శిక్ష అనుభవించినా, చివరికి వారి శాశ్వత గమ్యస్థానము స్వర్గమే. అదేవిధంగా, ఎవరైతే షిర్క్ నకు పాల్బడుతున్న స్థితిలో (అల్లాహ్ కు సాటి కల్పిస్తున్న స్థితిలో) చనిపోతారో వారు శాశ్వతంగా నరకంలో వేయబడతారు.