ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు – దొంగతనం చేసేవారిలో అత్యంత హీనమైన వాడు ఎవరంటే, ఎవరైతే తన నమాజులో (సల్లాహ్ ను) దొంగతనం చేస్తాడో. ఎందుకంటే ఇతరుల ధనాన్ని దొంగిలిస్తే, దాని ద్వారా అతడు ఈ ప్రపంచములో ఏ కొద్దిగానైనా ఉపయోగం పొందగల అవకాశం ఉన్నది. ఇటువంటి దొంగ మాదిరి కాకుండా, ఇలాంటి దొంగ, తన పుణ్యఫలములో తానే దొంగతనం చేస్తున్నాడు, సలాహ్ యొక్క ప్రతిఫలములో తానే దొంగతనం చేస్తున్నాడు. అక్కడున్న వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఇలా ప్రశ్నించారు – ఎవరైనా తన సలాహ్ లో ఎలా దొంగతనం చేయగలడు? అని దానికి వారు ఇలా అన్నారు “అతడు తన రుకూను పూర్తిగా ఆచరించడు, అలాగే తన సజ్దాహ్ లను పూర్తిగా ఆచరించడు”, ఆ విధంగా అతడు రుకూ నూ, సజ్దాహ్ లను (నిదానంగా, ప్రశాంతంగా కాకుండా) తొందర తొందరగా పూర్తిచేస్తాడు, వాటిని సంపూర్ణంగా ఆచరించడు.