ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లోకి ప్రవేశించారు. ఆయన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, రెండు రకాతుల నమాజ్ త్వరత్వరగా పూర్తి చేసినాడు — నిలబడడం, రుకూ, సజ్దా ప్రశాంతంగా చేయలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని నమాజ్ను గమనిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి నమాజ్ ముగించాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్న మస్జిదు మూలకు వచ్చి సలాం చేసినాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడి సలాంకు సమాధానం ఇచ్చి ఇలా అన్నారు: "నీవు తిరిగి వెళ్లి నీ నమాజ్ను మళ్లీ చేయి, ఎందుకంటే నీవు నీ నమాజ్ ను పూర్తిగా చేయలేదు." అతను తిరిగి వెళ్లి మళ్లీ అంతకు ముందు వలే త్వర త్వరగా నమాజ్ పూర్తి చేసినాడు. మళ్లీ వచ్చి ప్రవక్తకు సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ అతనితో ఇలా పలికినారు: "నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నీవు ఇంకా నమాజ్ పూర్తిగా చేయలేదు." ఇలా మూడు సార్లు జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు: "మిమ్ములను సత్యంతో పంపినవాడిగా ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను దీని కంటే మెరుగ్గా చేయలేను. దయచేసి మీరు నాకు నేర్పండి." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా బోధించినారు: "నీవు నమాజ్ కొరకు నిలబడినప్పుడు, ముందుగా ప్రారంభ తక్బీర్ చెప్పు. ఆ తరువాత ఖుర్ఆన్ ప్రారంభం (సూరతుల్-ఫాతిహా) మరియు అల్లాహ్ నీకు సాధ్యము చేసినంత ఖుర్ఆన్ భాగాన్ని పఠించు. ఆ తరువాత రుకూలో వెళ్లి, పూర్తిగా ప్రశాంతంగా రుకూ చేయి — అరచేతులతో మోకాళ్ళను గట్టిగా పట్టుకుని, వీపును నేరుగా ఉంచి, శరీరాన్ని పూర్తిగా రుకూలో స్థిరంగా ఉంచు. ఆ తరువాత నిలబడు, అంటే పూర్తిగా నిటారుగా నిలబడు — ఎముకలు మళ్లీ సరైన స్థానాల్లోకి వచ్చేలా ప్రశాంతంగా నిలబడు. ఆ తరువాత సజ్దాలోకి వెళ్లి, పూర్తిగా ప్రశాంతంగా సజ్దా చేయి — నుదురు, ముక్కు, రెండు చేతులు, రెండు మోకాళ్లు, రెండు పాదాల వేళ్లు నేలపై ఉండాలి. ఆ తరువాత రెండు సజ్దాల మధ్య ప్రశాంతంగా కూర్చో. ప్రతి రకాతులో ఇదే విధంగా చేయి."