ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు, ప్రజలు ఆయనను చూడడానికి ఆయన వైపునకు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆయన వైపు వెళ్ళిన వారిలో యూదపండితుడైన అబ్దుల్లా ఇబ్న్ సలామ్ (రదియల్లాహు అన్హు) ఒకరు (అప్పటికి ఆయన ఇస్లాం స్వీకరించలేదు). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూసిన వెంటనే ఆయనలో కనిపించిన తేజస్సు, సౌందర్యం మరియు నిజమైన గాంభీర్యం కారణంగా ఆయన ముఖం అబద్ధాలు పలికేవాని ముఖం కాదని, అతనికి తెలిసిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నుండి అతను విన్న మొదటి విషయం ఏమిటంటే, స్వర్గంలోనికి చేర్చే పనులు చేయమని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను కోరినారు, వీటిలో: మొదటిది: ‘సలాం’ను (శాంతి శుభాకాంక్షలను) బహిరంగంగా వ్యాప్తి చేయుట; తరుచుగా సలాం చేయుట, తెలిసిన వారికైనా మరియు తెలియని వారికైనా. రెండవది: ఒక సదఖాగా (దాతృత్వరూపేణా), విందు రూపంలో; మరియు ఆతిథ్యం ద్వారా ప్రజలకు అన్నం తినిపించుట. మూడవది: మీ తండ్రి వైపు నుండి లేదా తల్లి వైపు నుండి మీకు రక్త సంబంధాలు లేదా బంధుత్వం ఉన్నవారితో బంధుత్వాలను, కుటుంబ సంబంధాలను కొనసాగించడం. నాలుగవది: ఐచ్ఛిక (స్వచ్చంద) ఆరాధన అయిన రాత్రి నమాజును (ఖియాముల్లైల్ నమాజును) ప్రజలు నిద్రిస్తున్న సమయాన ఆచరించుట.