ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించడం జరిగింది “అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఉత్తమమైన ఆచరణ ఏది?” అని. ఆయన “విధిగా ఆచరించవలసిన ప్రతి ఫర్ద్ నమాజును, షరియత్ ప్రదాత (అయిన అల్లాహ్) దాని కొరకు నిర్ధారించిన సమయములోనే ఆచరించుట” అన్నారు. దాని తరువాత తల్లిదండ్రుల పట్ల కరుణ కలిగి ఉండడం, వారి పట్ల విధేయత కలిగి ఉండడం, వారి హక్కులను నెరవేర్చడం, వారికి అవిధేయత చూపడం నుండి దూరంగా ఉండడం (అన్నారు); దాని తరువాత - తన సంపదతో, తన ప్రాణముతో అల్లాహ్ యొక్క వాక్కును ఉన్నతం చేయుట కొరకు, ఇస్లాం ధర్మాన్ని మరియు దాని ప్రజలను రక్షించడానికి, మరియు ఇస్లాం ధర్మపు ఆచారాలను రక్షించడానికి - అల్లాహ్ కొరకు జిహాదు చేయుట – అన్నారు. ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: "ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు తెలిపిన విషయాలు. ఒకవేళ నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించి ఉంటే, ఆయన ఇంకా ఎక్కువ (విషయాలు) చెప్పి ఉండేవారు.”