కలహాలు, గందరగోళం, పరస్పర హత్యలు ఎక్కువగా ఉన్న కాలంలో కూడా ఎవరు ఆరాధనలను పట్టుదలగా నిరంతరం కొనసాగిస్తూ ఉంటారో, వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద మక్కా విజయానికి ముందు హిజ్రత్ చేసినవారి స్థానం లభిస్తుంది. అశాంతి, ఫిత్నా (కలహాలు), హత్యలు, మరియు ప్రజల వ్యవహారాలు గందరగోళంగా ఉన్న కాలంలో ఆరాధనలో నిబద్ధంగా ఉండాలని, దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం సూచించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద అలాంటి సమయంలో కూడా ఆరాధన కొనసాగించినందుకు లభించే పుణ్యం, హిజ్రత్ (వలస) చేసిన వారి పుణ్యంతో సమానం. ఎందుకంటే, అటువంటి కష్టకాలంలో ప్రజలు ఆరాధనను మర్చిపోయి, ఇతర విషయాలలో మునిగి పోతారు, అతి కొద్దిమంది మాత్రమే ఆరాధనకు సమయం కేటాయిస్తారు.