విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ఏదైనా ఆచరణ (ఆరాధన) చేయమని ఆజ్ఞాపించినప్పుడు, వారు దానిని నిరంతరం కొనసాగించడంలో విఫలమవుతారేమోనన్న భయంతో, వారికి కష్టమైనది కాకుండా సులభమైన దానినే ఆజ్ఞాపించేవారు. ఆయన కూడా, వారికి ఆజ్ఞాపించిన సులభమైన పనులనే ఆచరించేవారు. అయితే వారు, ఆయన కంటే ఉన్నత స్థాయిలను పొందడానికి, తాము ఆరాధనలలో మరింత ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉందని భావించి, కష్టమైన పనులను తమపై విధించమని ఆయనను కోరారు. అప్పుడు వారు ఇలా పలుకుతారు: "ఓ రసూలుల్లాహ్! నిశ్చయంగా మా పరిస్థితి మీ పరిస్థితిలాంటిది కాదు, ఎందుకంటే అల్లాహ్ మీ గత మరియు భవిష్యత్ పాపాలను మన్నించాడు." దానికి ఆయన ముఖంలో స్పష్టంగా ఆగ్రహం కనిపించేంతగా ఆయన ఆగ్రహం చెందారు. ఆ తరువాత ఆయన ఇలా పలికారు: "నిశ్చయంగా మీలోకెల్లా అత్యంత దైవభీతిపరుడను మరియు అల్లాహ్ గురించి అత్యధికంగా తెలిసినవాడను నేనే. కావున, నేను మీకు ఆజ్ఞాపించిన దానిని మీరు చేయండి.