కొద్ది మంది ప్రజల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది, వారు మొత్తం పది మంది ఉన్నారు. ఆయన వారిలో తొమ్మిది మంది నుండి ఇస్లాం పట్ల విధేయత చూపాలని, ఆయనను అనుసరించాలని విధేయతా ప్రమాణం తీసుకున్నారు. కాని పదవ వ్యక్తి నుండి ప్రమాణం తీసుకోలేదు. దీని వెనుక ఉన్న కారణం గురించి అడిగినప్పుడు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అతడు దిష్టి తగలకుండా ఉండడానికో, లేదా ఏదైనా చెడు లేదా కీడును దూరం చేయడానికో, పూసలు లేక అటువంటి దానితో చేయబడిన తాయత్తును వేలాడదీసుకునో లేక కట్టుకునో ఉన్నాడు. కాబట్టి, ఆ వ్యక్తి తాయెత్తు ఉన్న ప్రదేశంలోనికి తన చేతిని పోనిచ్చి, దానిని కత్తిరించి, దానిని వదిలించుకున్నాడు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని విధేయతా ప్రతిజ్ఞను అంగీకరించి, తాయెత్తులకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ దానికి సంబంధించిన ఆదేశాన్ని స్పష్టం చేస్తూ ఇలా అన్నారు: “ఎవరైతే తాయత్తును వేలాడదీసుకుంటాడో, నిశ్చయంగా అతడు ‘షిర్క్’నకు (బహుదైవారాధనకు) పాల్బడినట్లే.”