ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటిలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉన్న చోటుకి వెళ్ళారు. అక్కడ ఒక సామానులు పెట్టుకునే బీరువాలాంటిది ఉన్నది, దానిపై ఆమె సన్నని వస్త్రపు తెర లాంటి దానిని వేళాడదీసి ఉంచినారు. దానిపై జీవుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. అల్లాహ్ కోసం కోపంతో ఆయన ముఖపు రంగు మారిపోయింది, మరియు ఆయన దానిని (ఆ తెరను) తీసివేసారు. ఆయన ఇలా అన్నారు: “ప్రళయ దినాన అత్యంత కఠినమైన శిక్షను అనుభవించే వ్యక్తులు ఎవరంటే తాము చిత్రించిన చిత్రాలతో అల్లాహ్ యొక్క సృష్టిని అనుకరించటానికి ప్రయత్నించేవారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా అన్నారు: “మేము దానితో ఒకటో లేక రెండో తలదిండ్లు తయారు చేసుకున్నాము."