ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ యొక్క ప్రతి వ్యక్తి స్వర్గములోనికి ప్రవేశిస్తాడని, కేవలం ఎవరైతే దూరంగా ఉండిపోతాడో అతడు తప్ప అని తెలియజేసారు. అక్కడ ఉన్న సహాబాలు రజియల్లాహు అన్హుమ్ “ఎవరు దూరంగా ఉండిపోతారు ఓ రసూలుల్లాహ్?” అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చినారు: ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశహరునికి విధేయత చూపుతాడో, అతడి ఆదేశ పాలన చేస్తాడో మరియు అతడిని అనుసరిస్తాడో, అతడు స్వర్గం లోనికి ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే ఆయనకు అవిధేయత చూపుతాడో, షరియత్ ను అనుసరించడో, అతడి అవిధేయత, దుష్కర్మల కారణంగా స్వర్గం లోనికి ప్రవేశించడానికి నిరాకరించబడతాడు.