అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట అన్నారు; దానిపై నేను రెండో మాట అన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఎవరైతే అల్లాహ్ ను గాక ఇంకెవరినైనా అల్లాహ్ కు సాటి కల్పిస్తూ వేడుకుంటాడో, మరియు ఆ విధానం పైనే మరణిస్తాడో అతడు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు.” మరియు నేను ఇలా అన్నాను “ఎవరైతే అల్లాహ్ ను గాక మరింకెవరినీ వేడుకొనడో అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు.” ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
explain-icon

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలుపుతున్నారు: ఎవరైతే అల్లాహ్ కు చెందవలసిన దానిని వేరే ఇంకెవరికైనా అంకితం చేస్తారో, ఉదాహరణకు అల్లాహ్ కు కాకుండా వేరే వారికి దుఆ చేయడం, లేక ఆయనను గాక సహాయం కొరకు (ఆయన స్థానములో) వేరే ఇంకెవరినైనా అర్థిస్తాడో – మరియు అదే విధానం పై మరణిస్తాడు అతడు నరకవాసులలోని వాడు అవుతాడు. అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు దానికి కొనసాగింపుగా ఇలా అన్నారు: “ఎవరైతే ఎవరినీ లేక దేనిని అల్లాహ్ కు సాటి కల్పించకుండా, ఆ స్థితిలోనే మరణిస్తాడో అతని గమ్యస్థానము స్వర్గము.”

explain-icon

fawaed

  • దుఆ చేయుట అనునది ఒక ఆరాధన, అది కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ కు మాత్రమే చేయదగిన ఆరాధన.
  • ఇది ‘తౌహీద్’ (అల్లాహ్ ఒక్కడే అని విశ్వసించుట) యొక్క ఘనత. ఎవరైతే తౌహీద్ పైనే మరణిస్తాడో అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు; అతడు పాల్బడిన కొన్ని పాపకార్యాల కొరకు శిక్షించబడినా సరే.
  • అలాగే ‘షిర్క్’ (బహుదైవారాధన) ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తున్నది. ఎవరైతే ‘షిర్క్’ పైనే మరణిస్తాడు అతడు నరకాగ్నిలోనికి ప్రవేశిస్తాడు.