ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా విశదపరుస్తున్నారు: పాప కార్యాలకు పాల్బడిన ఒక ముస్లిం కొరకు అల్లాహ్ చేత అతని పాపములు క్షమించబడుటకు, అతనికి అల్లాహ్ చేత క్షమాభిక్ష ప్రసాదించబడుటకు అవకాశం ఉన్నది; కేవలం చేసిన పాపాన్ని గర్వంగా, డంబాలు పలుకుతూ, మూఢంగా జనుల ముందు బయల్పరిచే వాడు తప్ప. అటువంటి వాడు క్షమాభిక్షకు పాత్రుడు కాడు; ఎందుకంటే రాత్రివేళ అతడు పాపకార్యానికి ఒడిగడతాడు, అపుడు అల్లాహ్ అతడి పాపాన్ని (లోకుల నుండి) కప్పివేసి ఉంచినప్పటికీ; ఉదయం అతడు తాను క్రితం రాత్రి ఇలా ఇలా చేసాను అని చెబుతాడు. రాత్రి అతడు తన ప్రభువు పరదా మాటున గడుపుతాడు, కానీ ఉదయం అతడు స్వయంగా ఆ పరదాను తొలగించి తనను తాను బహిరంగ పరుచుకుంటాడు.