ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా మరియు మే’రాజ్ యాత్రలో స్వర్గనరకాల దర్శనానికి తీసుకు వెళ్ళబడినపుడు, రాగి గోళ్ళు కలిగి ఉండి వాటితో ముఖాలను, మరియు ఛాతీలను, అవి చీలికలు అయ్యేలా గోక్కుంటూ ఉన్న వ్యక్తులను దాటుకుంటూ వెళ్ళడం జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాంను ఇలా అడిగారు: “ఓ జిబ్రయీల్! ఏమి చేసినందుకు వీరు ఈ శిక్షకు అర్హులైనారు?” జిబ్రీల్ అలైహిస్సలాం) ఇలా జవాబిచ్చారు: “వీరు ప్రజల గురించి వారి వీపు వెనుక చెడుగా మాట్లాడేవారు, వారిపై అపనిందలు మోపేవారు మరియు వారి గౌరవానికి భంగం కలిగించేవారు.”