ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో మూడు రకాల వ్యక్తులను గురించి తెలియజేసినారు: వారు పశ్చాత్తాప పడకపోయినా లేక క్షమించబడక పోయినా పునరుత్థాన దినమున అల్లాహ్ యొక్క మూడు శిక్షలకు పాత్రులవుతారు. మొదటిది: అల్లాహ్ తన తీవ్రమైన కోపం కారణంగా పునరుత్థాన దినాన వారితో మాట్లాడడు. పైగా ఆయన వారి నుండి దూరంగా ఉంటాడు లేదా ఆయన వారితో వారికి నచ్చని విధంగా మాట్లాడి వారి పట్ల తనకున్న అసంతృప్తిని సూచిస్తాడు. రెండవది: ఆయన వారిని స్తుతించడు, పొగడడు, మరియు వారి పాపాలను కడిగివేయడు. మూడవది: వారు పరలోకంలో కఠినమైన మరియు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు. ఆ మూడు రకాల వ్యక్తులు వీరే: మొదటి రకం: వ్యభిచారానికి పాల్బడిన వృద్ధుడు. రెండవది: సంపద లేకపోయినా ప్రజల పట్ల అహంకారంతో ఉండే పేదవాడు. మూడవది: కొనేటప్పుడు మరియు అమ్మేటప్పుడు తరచుగా అల్లాహ్ పై ప్రమాణం చేసేవాడు (అల్లాహ్ మీద ఒట్టు అనుట), తద్వారా అల్లాహ్ పేరును దిగజార్చేవాడు, కించపరిచేవాడు మరియు దానిని ధనం సంపాదించడానికి ఒక మాధ్యమంగా ఉపయోగించేవాడు.