ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: పూర్వకాలంలో ఒక వ్యక్తి గాయపడినాడు. అతడు బాధకు తట్టుకోలేక, సహనం కోల్పోయి, కత్తితో తన చేతిని కోసుకున్నాడు. దాని వలన రక్తస్రావం ఆగక, చివరకు అతడు మరణించాడు. దానికి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికినాడు: "నా దాసుడు తన మరణాన్ని త్వరగా తెచ్చుకున్నాడు; కాబట్టి నేను అతనికి స్వర్గాన్ని నిషేధించాను."