ప్రవక్త ముహమ్మద్ ﷺ స్పష్టంగా ఇలా తెలియజేశారు: హానికరమైనది ఏ రూపంలో ఉన్నా, దానిని తన కొరకు మరియు ఇతరుల కొరకు దూరంగా ఉంచడం తప్పనిసరి. ఎందుకంటే ఎవ్వరూ తమకు తాము హాని కలిగించుకోవడం గానీ, ఇతరులకు హాని కలిగించడం గానీ ధర్మసమ్మతం కాదు. ఒక వ్యక్తి నష్టానికి ప్రతీకారంగా నష్టాన్ని కలిగించడం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే న్యాయమైన ప్రతీకారం (ఖిసాస్) పద్ధతిలో తప్ప, నష్టాన్ని నష్టంతో తొలగించకూడదు. అది కూడా హక్కుల అతిక్రమణ లేకుండా మాత్రమే జరగాలి.