అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పలవు గాక!”; అక్కడ ఉన్నవారు “ఎవరు, ఓ రసూలల్లాహ్?” అని అడిగారు. దానికి ఆయన “ఎవరి జీవిత కాలములోనైతే అతని తల్లిదండ్రులలో, ఒకరు గానీ లేక ఇద్దరు గానీ, వృద్ధాప్యానికి చేరుకున్నారో, మరియు (వారికి సేవ చేయని కారణంగా) అతడు స్వర్గములోనికి ప్రవేశించలేదో అతడు.” అన్నారు. ప్రామాణికమైన హదీథు - ముస్లిం నమోదు చేసినారు:
explain-icon

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శాపనార్థాలు పెట్టినట్లుగా అతడికి తలవంపులు కలగాలని, అతడు అవమానం పాలు కావాలని, ఎంతగా దుఆ చేసినారు అంటే, చివరికి వారి ముక్కు మట్టిలో పెట్టినంతగా. అక్కడ ఉన్న వారు “ఎవరు అతడు ఓ రసూలల్లాహ్, మీరు అంతగా అతనికి వ్యతిరేకంగా దుఆ చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘ఎవరైతే తన తల్లిదండ్రులలో – ఒకరిని గానీ లేక ఇద్దరిని గానీ - తన జీవితములోనే వృద్ధాప్యానికి చేరుకోవడం చూస్తాడో, వారి పట్ల దయ, కరుణ కలిగి ఉండక, వారి పట్ల అవిధేయుడై ఉండి ఆ కారణంగా అతడు స్వర్గములోనికి ప్రవేశించలేడో – అతడు’ అన్నారు.

explain-icon

fawaed

  • తల్లిదండ్రుల పట్ల బాధ్యత గలవారై, విధేయులై ఉండడం సంతానం యొక్క విధి, అది వారు స్వర్గములో ప్రవేశించడానికి ఒక కారణం అవుతుంది, ప్రత్యేకించి వారు ముసలితనములో ఉన్నపుడు మరియు శక్తి క్షీణించిన దశలో ఉన్నపుడు.
  • తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడం ‘కబీరహ్’ పాపములలో ఒకటి (ఘోరాతి ఘోరమైన పాపములలో ఒకటి).