ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై "ఇదా జాఅ న్నస్రుల్లాహి వల్ ఫత్హు" (నస్ర్ సూరహ్) అవతరించినప్పుడు, ఆయన ఆ ఖుర్ఆన్ ఆయతులోని ఆదేశాన్ని అమలు చేయడంలో ఆత్రుత చూపారు. అల్లాహ్ ఆదేశించినట్లు: "కాబట్టి నీ ప్రభువును స్తుతితో మహిమపరచు, ఆయనను క్షమాపణ కోరు" (నస్ర్: 3). దీని ప్రకారం, ప్రవక్త ﷺ నమాజ్లోని రుకూలో, సజ్దాలో తరచుగా ఇలా పలికేవారు: "సుబహానక" అంటే: "ఓ అల్లాహ్! నీవు ప్రతి లోపం నుండి, కొరత నుండి పరమ పవిత్రుడవు, నీకు తగనిది ఏదీ నీలో లేదు."; "అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక" అంటే: "ఓ అల్లాహ్! ఓ మా ప్రభువా, సకల స్తుతులు నీకే శోభిస్తాయి, నీ స్వరూపంలో, లక్షణాలు, కార్యాల్లో నీవు పరిపూర్ణుడవు."; "అల్లాహుమ్మగ్ఫిర్లీ" అంటే: "ఓ అల్లాహ్! నన్ను క్షమించు, నా పాపాలను తొలగించు, వాటిని మన్నించు."