ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ముస్లిములు మరియు యూదులు ఒకరితోనొకరు యుద్ధానికి పాల్బడనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు అని తెలియజేస్తున్నారు. (ఆ యుద్ధంలో) ఒకవేళ యూదుడు ఒక శిల వెనుక దాక్కోవడానికి పారిపోయినా, అల్లాహ్ (తన అనుఙ్ఞతో) ఆ శిల మాట్లాడేలా చేస్తాడు. దానితో అది ముస్లిమును కేకవేసి తన వెనుక యూదుడు దాక్కుని ఉన్నాడని అంటుంది. అతడు వచ్చి యూదుడిని సంహరించే వరకు అలా అంటూనే ఉంటుంది.