ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్ యొక్క నియమాలను మూడు విభాగాలు చేసి ప్రస్తావిస్తున్నారు: అవి 1) ప్రస్తావించబడని విషయాలు; 2) నిషేధాలు; మరియు 3) ఆదేశాలు. మొదటి భాగనికి సంబంధించి: ఇవి ఏ విషయాలపైనైతే షరియత్ మౌనంగా ఉన్నదో ఆ విషయాలు; వాటి గురించి ఒక ప్రత్యేకమైన ఆదేశం అంటూ లేని విషయాలు; అటువంటి విషయాల పట్ల ప్రాథమిక సూత్రం ఏమిటంటే వాటి గురించి ఏమీ విధి చేయబడ లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు సంబంధించి ఆయన కాలములో, “ఇది విధి చేయబడుతుందేమో”, లేక “ఇది నిషేధించ బడుతుందేమో” అనే భయంతో ఏదైనా విషయానికి సంబంధించి అనేక ప్రశ్నలు అడగ వలసిన అవసరం లేదు (ఎందుకంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్యనే ఉన్నారు కనుక). ఆ విషయాలను ఆ విధంగానే వదలివేసి, నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల పట్ల కరుణ చూపినాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత, ప్రశ్న ఫత్వా రూపంలో లేదా మతపరమైన విషయాలలో ఏమి అవసరమో బోధించుటకు సంబంధించినది అయితే, అది అనుమతించబడుతుంది, వాస్తవానికి అది ఆదేశంగా పరిగణించబడుతుంది. ఏదైనా విషయానికి సంబంధించి మొండిపట్టుగా, లేదా కపటత్వముతో కూడిన వాదనలకు ఒడిగట్టడం వంటి వాటికి దూరంగా ఉండమని ఈ హదీథులో ఉపదేశించబడుతున్నది. ఎందుకంటే అది ఇస్రాయీలు సంతతివారికి ఏమి జరిగినదో దానికి (పరాభవానికి, కష్టానికి) దారి తీస్తుంది. వారిని ఒక ఆవు బలి ఇవ్వమని ఆదేశించడం జరిగింది. వారు ఏదైనా ఒక ఆవు తీసుకువచ్చి బలి ఇస్తే ఆ ఆదేశంపై అమలు చేసిన వారయ్యేవారు. కానీ వారు ఆ ఆవు వివరాలకు సంబంధించి అనవసరమైన వాదనలో దిగి కఠినావస్థలో పడిపోయారు. అందుకని ఆ ఆదేశాన్ని పాటించడం వారికి కఠినతరం చేయబడింది. రెండవది: “నిషేధాలు”: నిషేధించిన వాటిని వదిలి వేసిన వానికి పుణ్యఫలం లభిస్తుంది; ఆ పనులకు పాల్బడిన వానిని శిక్షించడం జరుగుతుంది. కనుక నిషేధాలన్నింటికీ దూరంగా ఉండాలి. మూడవది: “ఆదేశాలు”: ఆదేశించబడిన విషయాలను ఆచరించిన వాడు పుణ్యఫలం పొందుతాడు, ఆదేశించబడిన విషయాలను ఆచరించకుండా వదలివేసిన వాడు శిక్షించబడతాడు. కనుక ఆదేశించబడిన విషయాలను ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు ఆచరించాలి.